న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చోక్సీని డొమినికా నేరుగా భారత్కు అప్పగిస్తుందా? అంటిగ్వా-బార్బుడా పోలీసులకు స్వాధీనం చేస్తుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి మాయమైన చోక్సీ ఆచూకీ కోసం అంటిగ్వా ఇంటర్ పోల్ సాయం కోరింది.
ఎట్టకేలకు డొమినికా పోలీసులు మంగళవారం మెహుల్ చోక్సీని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. డొమినికా మీదుగా క్యూబాకు పారిపోవాలని చోక్సీ భావించాడు.
అయితే, అతడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంగతి బుధవారం బహిర్గతమైంది. చోక్సీ మాయం అయ్యాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి అంటిగ్వా-బార్బుడా, డొమినికా ప్రభుత్వాలతో కేంద్రం నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉంది.
చోక్సీతోపాటు ఆర్థిక నేరాల కేసుల్లో విదేశాలకు పారిపోయిన వారిని తిరిగి దేశానికి సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చోక్సీని భారత్కు తీసుకొచ్చే విషయమై దర్యాప్తు సంస్థలు ద్రుష్టి సారించాయని తెలుస్తున్నది.
ఇప్పటి వరకు తమ దేశ పౌరసత్వం ఉందని, మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించబోమన్న అంటిగ్వా-బార్బుడా మాట మార్చింది. నేరుగా మెహుల్ చోక్సీని భారత్కు అప్పగించాలని డొమినికాను అంటిగ్వా-బార్బుడా ప్రధాని గాస్టోన్ బ్రౌనే కోరారు.
మంగళవారం రాత్రి చోక్సీని అరెస్ట్ చేసిన వార్తలు తెలియగానే, అతడ్ని భారత్కు నేరుగా అప్పగించాలని డొమినికాను కోరినట్లు మీడియాతో చెప్పారు గాస్టోన్ బ్రౌనే.
చోక్సీని అంటిగ్వాకు తిరిగి అప్పగించొద్దు. భారత్లో అతడు క్రిమినల్ నేరాభియోగాలు ఎదుర్కొంటున్నాడని గాస్టోన్ బ్రౌనే గుర్తు చేశారు. అతడ్ని ఇండియాకు తిప్పి పంపాల్సి ఉందన్నారు.
మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి మెహుల్ చోక్సీ.. పీఎన్బీలో రూ.13,500 కోట్ల విలువైన కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇది బయటపడే లోపు ఇద్దరు భారత్ విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ మోదీ.. లండన్ జైలులో ఉన్నాడు.
అయితే, మెహుల్ చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ మాత్రం చట్ట బద్ధంగా తన క్లయింట్ను నేరుగా భారత్కు అప్పగించడం కుదరదన్నారు. అంటిగ్వాకే అప్పగిస్తారన్నారు.
నోట్లు ముద్రించడమే మార్గం.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?
ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా జెఫ్ బెజోస్ స్థానం పదిలం
వ్యాక్సినేషన్ తోనే ఎకానమీపై మహమ్మారి ఎఫెక్ట్ కు చెక్ : ఆర్బీఐ
వ్యాక్సిన్లపై పన్ను కోతలేనట్లే!
హనుమంతుని జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ప్రధాని పర్యటన
ఐటీ కొత్త రూల్స్.. ఆందోళన వ్యక్తం చేసిన ట్విట్టర్ సంస్థ
మామిడి పండ్లు తినగానే ఆ ఐదింటి జోలికి అసలే పోవద్దు..!
నన్నెవరూ అరెస్ట్ చేయలేరు : రాందేవ్ బాబా
యాంటీబాడీ కాక్టెయిల్ ట్రయల్స్కు జైడస్ దరఖాస్తు
భారతీయ ఐటీ చట్టాలకు కట్టుబడి ఉన్నాం : గూగుల్ సీఈవో
12 సంవత్సరాలు పైబడిన వారికి మా వ్యాక్సిన్ సురక్షితం : ఫైజర్
దగ్ధమైన సింగపూర్ నౌక.. పర్యావరణానికి పెనుముప్పు