లండన్: క్రికెట్లో టీ20 తరహాలోనే మరో కొత్త ఫార్మాట్ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తీసుకొస్తోంది. ఈ ఫార్మాట్ను ది హండ్రెడ్( The Hundred ) అని పిలుస్తున్నారు. 100 బాల్ ఫార్మాట్ ఆరంభ సీజన్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు షాకిచ్చారు. ఇంగ్లాండ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తొలి సీజన్కు ఆస్ట్రేలియా క్రికెటర్లు దూరం కానున్నారు. జూలై 22న టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నీలో పాల్గొనేవారు ఇంగ్లాండ్కు చేరుకున్నాక 14 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది.
వెస్టిండీస్తో ఆసీస్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ జూలై 25న ముగియనుంది. జూలై 25వ తేదీన విండీస్ పర్యటన ముగియనుండటంతో ఆసీస్ ఆటగాళ్లు ది హండ్రెడ్ టోర్నీకి దూరంకానున్నారు. డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ ఫించ్ సహా పలువురు ఆసీస్ ప్లేయర్లు టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం ఉంది.