పొంచి ఉంది కరోనా మహమ్మారి
అవసరమయితేనే బయటకు రావాలి
మార్కెట్లో కనీస జాగ్రత్తలు పాటించాలి
ఇళ్లలోనూ పరిశుభ్రత పాటిస్తేనే రక్షణ
అశ్వారావుపేట, మే 22: కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తున్నది. నిత్యావసరాలు, ఇతర పనుల కోసం 4 గంటలు మినహాయింపు ఇచ్చింది. ఈ సమయంలో పరుగులు తీయకుండా ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవాలి. లేదంటే కరోనా రక్కసి బారినపడే అవకాశం ఉంది. అవసరమయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలి. అనవసరంగా బయటకు వస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతేకాదు, మార్కెట్కు వచ్చినా కనీస జాగ్రత్తలు పాటించాలి. కరోనా వేళ డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యమివ్వాలి. ఇళ్లలో ఉన్నా.. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి.