న్యూఢిల్లీ : జూనియర్ రెజ్లర్ సాగర్ ధంఖర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు ఒక అనుచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య అనంతరం ప్రాంతాలను మారుస్తూ దాక్కుంటున్న సుశీల్ కుమార్ను ఎట్టకేలకు న్యూఢిల్లీ పోలీసులు పంజాబ్లో అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించేందుకు ట్రాన్సిట్ వారంట్పై ఢిల్లీకి తీసుకు వస్తున్నారు. హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్పై లక్ష రూపాయలు, సహచరుడు అజయ్పై రూ.50 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు.
ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఈనెల 5 వ తేదీన జూనియర్ రెజ్లర్ సాగర్ ధంఖర్ దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. పలువురు రెజ్లర్లు గాయపడి దవాఖానలో కోలుకుంటున్నారు. వారు ఇచ్చిన వాంగ్మూలం మేరకు సుశీల్ కుమార్పై కేసు నమోదు చేసి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగినప్పటి నుంచి సుశీల్ కుమార్ తప్పించుకు తిరుగుతున్నాడు. హత్య జరిగిన ప్రాంతంలో నిలిపివుంచిన కారులో నుంచి తుపాకులు, బుల్లెట్లు లభించాయి.
పోలీసుల పట్టు నుంచి తప్పించుకోవడానికి రెజ్లర్ సుశీల్ నిరంతరం తన స్థావరాన్ని మార్చుకున్నట్లు తెలుస్తున్నది. సుశీల్ను పట్టుకోవడానికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరంతరం తనిఖీలు జరిపింది. ఈ క్రమంలో మీరట్ టోల్ ప్లాజా వద్ద రెజ్లర్ సుశీల్ కారులో ప్రయాణిస్తున్నది అక్కడి సీసీటీవీల్లో రికార్డైనదాని బట్టి తెలుస్తున్నది. చివరికి పోలీసులు అతన్ని పంజాబ్ రాష్ట్రంలో పట్టుకోగలిగారు.
ఆఫ్ఘాన్లో జిల్లాను ఆక్రమించిన తాలిబాన్లు.. దాడుల్లో 40 మంది తాలిబాన్లు హతం
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..