మహబూబ్నగర్ : ప్రముఖ సినీ నటి అక్కినేని సమంత సహకారంతో ప్రత్యూష సపోర్ట్ మరియు దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాంకిషన్కు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కోరమోని నర్సిములు, డీసీసీబీ వైస్ చైర్మన్ కె.వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.