మండలంలో తగ్గిన పాజిటివ్ కేసులు
వారం రోజుల్లో ఒకటే కేసు
ప్రజల స్వీయ నియంత్రణ
సడలింపు సమయంలోనే బయటకు..
తర్వాత ఇంటికే పరిమితం
భైంసాటౌన్, మే, 18 : ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మండల వ్యాప్తంగా సత్ఫలితా లనిస్తోంది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మంగళవారం వరకు మహాగాం పీహెచ్సీ పరిధి లో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. మండలంలో జనాభా 38,841 ఉంది. లాక్డౌ న్ ప్రారంభమైన రోజు 12వ తేదీన 21 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి కీ నెగెటివ్ వచ్చింది. అదే విధంగా 13న 12 మం దికి, 14న 19 మందికి, 15న 20 మందికి, 16న ఏడుగురికి పరీక్షలు చేశారు. అదే విధంగా 17న 14 మందికి, 18న నలుగురికి పరీక్షలు నిర్వహిం చారు. కేవలం 17న ఒకరికీ మాత్రమే స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలింది. మహాగాం పీహెచ్సీ పరిధిలో ఇప్పటి వరకు 7,946 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వ హించారు. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న రోగు ల సంఖ్య గణనీయంగా పెరిగింది. లాక్డౌన్ నేప థ్యంలో ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. సడలింపు సమయంలో సరుకులను తీసు కెళ్లి ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో పాజిటివ్ కేసుల గణనీయంగా తగ్గింది. ఏడు రోజుల్లో మం డల వ్యాప్తంగా దాదాపు వంద మందికి పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అదే విధంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎవరైనా జ్వరంతో బాధపడు తున్నారా.. కరోనా లక్షణాలు ఉన్నాయా.. అని వివరాలు సేకరిస్తున్నారు. కేసులు తగ్గడంపై ప్రజ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పీహెచ్సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు ప్రతి రోజూ కరోనా సోకిన వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వారిలో మనోధైర్యాన్ని కల్పించారు. తద్వారా మంచి ఫలితాన్ని రాబ ట్టారు. లాక్డౌన్ తర్వాత పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చింది. పాజిటివ్ కేసులు తగ్గా యి. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.