రంగారెడ్డి : కరోనా మహమ్మారి బారిన పడి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు యాంపల్లి నిరంజన్ రెడ్డి నగరంలోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. యాంపల్లి నిరంజన్ రెడ్డి మృతిలో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిరంజన్ రెడ్డి మృతిపట్ల పలువురు టీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.