Nirmal
- Nov 18, 2020 , 02:31:31
బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం

- ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
- ‘నమస్తే’ కథానికి స్పందన
- ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్
ఎదులాపురం : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలులో జరిగిన అవకతవకల్లో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘కల్యాణలక్ష్మిలో అక్రమాలు’ అని ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఈ మేరకు ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయ (కల్యాణలక్ష్మి సెక్షన్) సీనియర్ అసిస్టెంట్ నదీంను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సంబంధి త మండలాల తహసీల్దార్లు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. అవకతవకల్లో ఇతరులు ఎవరైనా ఉన్నా వారిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇక ముందు ఈ పథకం అమలుకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
MOST READ
TRENDING