‘ఈ-ఆఫీస్'ను వంద శాతం అమలు చేయాలి

- కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ అర్బన్ : జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో (ఈ- ఆఫీస్) సాఫ్ట్వేర్ ద్వారా వంద శాతం దస్ర్తాల నిర్వహణను చేపట్టాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘ఈ-ఆఫీస్' పాలన అమలుపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ..కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్, మండల ప్రజాపరిషత్, మున్సిపల్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దస్ర్తాల నిర్వహణను ఈ ఆఫీస్ ద్వారా అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతి శాఖకూ ఒక నోడల్ అధికారి, సాంకేతిక సహాయకుడిని నియమించి, శిక్షణ కూడా ఇచ్చామని వెల్లడించారు. ఈ ఆఫీస్ ద్వారా ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో సుధీర్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, డీఈవో ప్రణిత, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఆదిపురుష్పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్