నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలో మంగళవారం కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యం గా కల్లాల్లోకి వరద నీరు చేరగా, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన బస్తాలో నింపి ఉన్న ధాన్యమంతా తడిసిపోయింది. తడిసిన వడ్లను ఆరబెట్టేందుకు రైతులు చాలా అవస్థలు పడ్డారు. మామిడి కాయలు నేలరాలగా, కలాల్లో ఉన్న మిర్చి తడిసిపోయింది. గాలివానతో మహబూబాబాద్ జిల్లాలో పెద్ద సంఖ్య చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నెల్లికుదురు మండలం చిన్నముప్పారం, మునిగలవీడు, మదనతుర్తి గ్రామాల్లో చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరి పో యాయి. మేచరాజుపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న శ్మశానవాటిన పైకప్పు విరిగి పడిపోయింది. న ర్సింహులపేట మండలంలో సుమారు 200 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. 50 ఇళ్లపైనున్న రేకులు లేచిపోయినట్లు ఆధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు వరద నీటితో నిండిపోయాయి. పాత బీట్ బజార్, మేదరివాడ, రామాటాకీస్ లైన్ ప్రాంతాల్లో రోడ్డుపై వర్షం నీరు భారీగా నిలిచింది.
పిడుగుపడి ముగ్గురు రైతుల మృతి..
నెల్లికుదురు : పిడుగుపాటుకు ముగ్గురు రైతులు బలయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో వ్యవసాయ బావి పని చేసుకుంటున్న సమయం లో ఆరెల్లి కాంతమ్మ(45) మృతిచెందింది. నడికూడ మండలం రాయపర్తిలో వర్షానికి ధాన్యం తడవకుం డా పరదా కప్పి రాళ్లు పెడుతుండగా గంగోజుల రవీంద్రాచారి(40), ములుగు జిల్లా కాసిందేవిపేటలో పొ లంలో ఉన్న మిర్చి, వరి ధాన్యాన్ని కాపాడుకునేందు కు వెళ్లిన ఎండీ.రంజాన్(65) మృతిచెందారు. నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లికి చెందిన వరిపల్లి మ ల్లయ్య(45) చెట్టు విరిగి మీద పడడంతో మృతిచెందా డు. తన చిన్న కొడుకు దివాకర్తో కలిసి ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా దేవరుప్పులలో పిడుగుపడి పది గొర్రెలు మృత్యువాతపడ్డాయి.