ములుగు : జిల్లాలోని కన్నాయి గూడెం మండలం తుపాకుల గూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులను మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ పరిశీలించారు. బ్యారేజీ పనుల స్థితి గతులను సంబంధిత ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యారేజీ, రెగ్యులేటరీ, రైలింగ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ నెల చివరి వరకు బ్యారేజీ పనులు పూర్తి చేసి నీటిని నిలువ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్ఈ సుధీర్ మాట్లాడుతూ.. సమ్మక్క బ్యారేజీ పనులు దాదాపుగా పూర్తి అయిందని, చిన్న చిన్న పనులు మిగిలాయి. వాటిని కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏఎస్పీ ఏటూరు నాగారం గౌస్ ఆలం, దేవాదుల ఈఈ జగదీష్ బాబు, సీఈ వీరయ్య, క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకట కృష్ణ, దేవేందర్ రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ