కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆపదలో ఉన్నవారికి ఉచిత అంబులెన్స్ సేవలు అందించేందుకు వెన్నపూస ఫౌండేషన్ ముందుకొచ్చింది. సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సీపీ సజ్జనార్ ఉచిత అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ ఉచిత సేవలు కావాల్సిన వారు 7710872108 నంబర్ను సంప్రదించాలని సీపీ కోరారు. కార్యక్రమంలో వెన్నపూస ఫౌండేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, కార్ హెడ్క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్రాజ్, ఎస్టేట్ ఆఫీసర్ సంతోష్కుమార్, ఫౌండేషన్ ప్రతినిధులు రామిరెడ్డి, విఘ్నేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.