చెన్నై : తోడుగా ఉంటానని మాటిచ్చి మహిళతో సహజీవనం చేస్తూ ఆపై అనుమానంతో ఆమెను కడతేర్చిన కసాయి ఉదంతం చెన్నైలో వెలుగుచూసింది. మహిళ ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న నిందితుడు ఆమె నిద్రిస్తున్న సమయంలో అంతమొందిచాడు. గతంలో ఓ వ్యక్తిని పెండ్లి చేసుకుని అతడి నుంచి విడిపోయిన బాధితురాలు మణిమాల(34) సురేష్ అనే వ్యక్తితో రెండేండ్ల నుంచి సహజీవనం చేస్తోంది.
మణిమాల ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న సురేష్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఇదే విషయమై బుధవారం రాత్రి ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. మణిమాలపై కోపం పెంచుకున్న సురేష్ గురువారం తెల్లవారుజామున ఆమె నిద్రిస్తుండగా గొంతుకు చీరను బిగించి ఊపిరాడకుండా చేసి ఉసురు తీశాడు. మణిమాల హత్యపై ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.