నేడు కృతజ్ఞతా ర్యాలీ

నిర్మల్ అర్బన్/ కుభీర్/ లక్ష్మణచాంద: కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా నిర్మల్ నియోజకవర్గంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కనాకాపూర్ నుంచి లక్ష్మణచాంద మండల కేంద్రం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఇం దులో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ర్యాలీ ని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులు పిలుపునిచ్చారు. లక్ష్మణచాందలో డీసీసీబీ వైస్ చైర్మ న్ రఘునందన్రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మి, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సాతం గంగారం, నాయకులు కృష్ణారెడ్డి, అడ్వాల రమేశ్ పిలుపునివ్వగా, కుభీర్లో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు దత్తూగౌడ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు పుప్పాల పీరాజీ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- కేఎన్ఆర్యూహెచ్ఎస్ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
- కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ టాప్
- దీప్సింగ్ సహా పలువురికి ఎన్ఐఏ సమన్లు: రైతు నేతల ఫైర్
- శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే
- యాడ్ జింగిల్స్ సాంగ్.. వావ్! ఎంత బాగుందో..