Nirmal
- Sep 23, 2020 , 01:56:51
ప్రగతి పనుల్లో వేగం పెంచాలి

- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- అధికారులతో సమీక్ష
నిర్మల్ టౌన్ : జిల్లాలో పల్లె ప్రగతి పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం పల్లె ప్రగతి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన శ్మశానవాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు, హరితవనాలు, ఇంకుడుగుంతల ఏర్పాటు వంటి పనులపై ఆరా తీశారు. అలాగే రైతు వేదికల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత ఉండేలా పంచాయతీ సిబ్బందిని ప్రోత్సహించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లను కూడా చేపట్టాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీపీవో వెంకటేశ్వర్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- జూబ్లీహిల్స్లో గ్యాంగ్వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
MOST READ
TRENDING