కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం మే 1 వరకు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయం మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రాత్రి ఎనిమిది గంటల కల్లా దుకాణాలను మూయించేందుకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా కొవిడ్ నిబంధనలను పాటించేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. గోషామహల్ డివిజన్ పరిధిలోని షాహినాయత్గంజ్, మంగళ్హాట్, హబీబ్నగర్, కుల్సుంపురా పోలీస్స్టేషన్ల పరిధిలోని వ్యాపార సముదాయాలను మూయించడంతో పాటు అత్యవసర సర్వీసులో ఉన్న వారిని తప్పా ఎవరిని అనుమతించడం లేదు. షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో అత్యధికంగా వ్యాపార, వాణిజ్య దుకాణాలు ఉండటంతో గోషామహల్ ఏసీపీ ఎం.నరేందర్ రెడ్డి నేతృత్వంలో షాహినాయత్గంజ్ ఇన్స్పెక్టర్ అజయ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బేగంబజార్ మార్కెట్లో దుకాణాలను మూయించి కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.