హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 23: మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత కేతిరి సాయిరెడ్డి(76) కన్నుమూశారు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాకలో మాణిక్యమ్మ-నరసింహారెడ్డి దంపతులకు 1945లో సాయిరెడ్డి జన్మించారు. 1989లో స్వతంత్ర అభ్యర్థిగా హుజూరాబాద్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో టీఆర్ఎస్లో చేరారు. సాయిరెడ్డి భౌతికకాయం వద్ద మంత్రి ఈటల రాజేందర్ నివాళులర్పించారు. సాయిరెడ్డి మృతిపట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సంతాపం తెలిపారు.