బీజేపీ, కాంగ్రెస్కి మాత్రం నాలుగు రోజుల పండుగ
నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
58వ డివిజన్ ప్రచారంలో మంత్రి అజయ్కుమార్
ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 22: ఎన్నికలంటే తమకు ఐదేళ్ల బాధ్యతని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్లకు నాలుగు రోజుల పండుగ మాత్రమేనని విమర్శించారు. కేఎంసీ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం 58వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యల పట్ల స్పందించే టీఆర్ఎస్ అభ్యర్థి శ్వేతను గెలిపించుకోవాలని కోరారు. పొద్దున్నే లేచి సైకిల్ మీద నగరమంతా తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నామని, నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కోరారు. వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్ను నిర్మించుకున్నామని, లకారం ట్యాంక్బండ్ను అద్భుతంగా సుందరీకరించుకున్నామని గుర్తుచేశారు. కారు గుర్తుపై ఓటు వేసి 58వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి దోరేపల్లి శ్వేతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాదిరాజు శ్రీనివాసరావు, వాలబోయిన వెంకటేశ్వర్లు, మాధవి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్ను వదలను : మమతా బెనర్జీ
నగదు బహుమతిలో ఆ బాలుడికే సగం.. రైల్వే ఉద్యోగిపై నెటిజన్ల ప్రశంసలు