డీఆర్డీవో, నోడల్ అధికారి శ్రీలత ఆదేశం
టీకా పంపిణీ కేంద్రాల పరిశీలన
శంకరపట్నం, ఏప్రిల్ 22: వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నోడల్ అధికారి, డీఆర్డీవో శ్రీలత ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మెట్పల్లి పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలతో పాటు వ్యాక్సిన్ల సంఖ్యను పెంచాలని తెలిపారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో ఓ పక్క కరోనా నిర్ధారణ పరీక్షలు, మరో పక్క వ్యాక్సినేషన్ను కొనసాగిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య సిబ్బంది డీఆర్డీవో దృష్టికి తెచ్చారు. దీంతో ఆమె సూచన మేరకు శుక్రవారం నుంచి పక్కనే ఉన్న మోడల్ స్కూల్ హాస్టల్ గదుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఎంపీడీవో భీమేశ్ వెల్లడించారు. కాగా, గురువారం పీహెచ్సీలో 246 మంది, మెట్పల్లిలో 440 మంది వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు.
వ్యాక్సినేషన్ను పరిశీలించిన రాష్ట్ర అబ్జర్వర్
వ్యాక్సినేషన్ ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ డాక్టర్ అశోక్ మెట్పల్లి వైద్య శిబిరాన్ని సందర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని టీకాలు వేసినది, వ్యాక్సినేషన్ సందర్భంగా తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వాయిల్స్ పరిశీలించారు. ఆయా చోట్ల జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా, వైద్యాధికారులు డాక్టర్ కిరణ్రాజ్, విద్యశ్రీ, సీహెచ్వో భాస్కర్ శివయ్య, ఎంపీవో సురేందర్, ఫార్మాసిస్ట్ మతిన్, పంచాయతీ కార్యదర్శి చిట్టి, సెర్ప్ సిబ్బంది, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
వ్యాక్సినేషన్ క్యాంపు షెడ్యూల్లో సవరణ
శంకరపట్నం, ఏప్రిల్ 22: వ్యాక్సినేషన్ క్యాంపుల షెడ్యూల్లో సవరణ చేసినట్లు ఎంపీడీవో భీమేశ్ తెలిపారు. ఈ నెల 23న గద్దపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో, 24న కాచాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కల్వల గ్రామస్తులు కాచాపూర్లో వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. అంతకుముందు ఈ నెల 23, 24 తేదీల్లో గద్దపాకలో శిబిరం నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
అన్నారం, లింగాపూర్లో అదనపు కేంద్రాలు
మానకొండూర్, ఏప్రిల్ 22: మండలంలోని కొండపల్కల, పచ్చునూర్ గ్రామాల్లో గురువారం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంపీడీవో దివ్యదర్శన్రావు సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అన్నారం, లింగాపూర్ గ్రామాల్లో శుక్రవారం అదనంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారులు స్వాతి, సంధ్యారాణి, సీహెచ్వో రాజునాయక్, ఐకేపీ ఏపీఎం సంతోష్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
యాక్టింగ్ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసిన జబర్దస్త్ కమెడియన్
IPL 2021 : బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుంటున్న దూబే