క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ఏనుగొండలో ఫాస్ట్ బాక్స్ క్రికెట్ ప్రారంభం
మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 21: జిల్లా క్రీడాకారులు క్రికెట్లో రాణించాలని క్రీడాశాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో బాక్స్ క్రికెట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాస్ట్ బాక్స్ క్రికెట్ హైదరాబాద్, బెంగళూర్లాంటి నగరల్లో ఆడుతారని, మహబూబ్నగర్లో అకాడమీ ఏర్పాటు అందుబాటులోకి తేవడం అభినందనీయమన్నారు. ప్రతి క్రీడా అంశంలో జిల్లా క్రీడాకారులు రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తున్నదన్నారు. జిల్లాలో క్రీడామైదానాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ చైర్మన్ కోరమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటిగణేశ్, కౌన్సిలర్లు రాము, కిశోర్, నిర్వాహకులు విక్రమ్ ఆదిత్య, సోహెల్ తదితరులు ఉన్నారు.