Nirmal
- Aug 05, 2020 , 01:58:45
తీజ్.. షురూ..

బంజారా గూడేల్లో తీజ్ సందడి మొదలైంది. తొమ్మిది రోజులపాటు.. ఈ ఉత్సవం సాగనున్నది. బోథ్ మండలం రఘునాథ్పూర్, దన్నూర్ (కే), నిగిని, కంటెగాం, పార్డి (బీ) తదితర తండాల్లో.. రాఖీ పౌర్ణమి రోజున సాయంత్రం పుట్టమన్నులో గోధుమలు అలకడంతో కార్యక్రమం ప్రారంభమైంది. కాగా, కృష్ణాష్టమి వరకు యువతులు ఆడిపాడనున్నారు. ఆ తరువాత వాగుల్లో నిమజ్జనం చేస్తారు. మంగళవారం తండాల్లోని నాయకుల ఇళ్ల ఎదుట యువతులు, బాలికలు.. గోధుమలను అలికిన బుట్టలు ఉంచి పూజలు చేశారు. సమీప వాగులు, కుంటల నుంచి నీటిని తెచ్చి, బుట్టల్లో చల్లారు. ఇలా.. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సంప్రదాయం ప్రకారం యువకులు అడ్డగించి.. పొడుపుకథలు విప్పాలని పట్టుబడుతారు. - బోథ్
తాజావార్తలు
- జూబ్లీహిల్స్లో గ్యాంగ్వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
MOST READ
TRENDING