ముంబై: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కోల్కతా నైట్రైడర్స్ బుధవారం రాత్రి వాంఖడే స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన చెన్నై ఉత్సాహంతో ఉండగా, వరుసగా రెండింటిలో ఓటమితో కోల్కతా ఒత్తిడిలో ఉంది. చెన్నైతో పోరులో గెలవాలని మోర్గాన్సేన పట్టుదలతో ఉంది.
టాస్ గెలిచిన కోల్కతా సారథి మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. హర్భజన్ సింగ్ స్థానంలో కమ్లేశ్ నాగరకోటి, షకీబ్ అల్ హసన్ స్థానంలో సునీల్ నరైన్ తుది జట్టులోకి వచ్చినట్లు మోర్గాన్ తెలిపాడు. ఈ మ్యాచ్లో డ్వేన్ బ్రావోకు విశ్రాంతినిచ్చామని, అతని స్థానంలో లుంగి ఎంగిడిని ఎంపికచేసినట్లు మహీ పేర్కొన్నాడు.