నిజాంసాగర్/ లింగంపేట/ పిట్లం/ బిచ్కుంద, ఏప్రిల్ 18: రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. బిచ్కుంద మండలం బండారెంజల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూ చించారు. క్వింటాలు నాణ్యమైన ధాన్యానికి ప్రభుత్వం రూ.1,888 మద్దతు ధరను అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు రామ్రెడ్డి, ఎంపీపీ అశోక్ పటేల్, జడ్పీటీసీ భారతీరాజు, రైతులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలోని బోనాల్, మెంగారం, లింగంపేట, ఐలాపూర్, లింగంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ గరీబున్నీసా బేగం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో లింగంపేట సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి, వైస్ చైర్మన్ మాకం రాములు, సీఈవో సందీప్, డైరెక్టర్లు సాయాగౌడ్, సిద్ధిరాములు, శ్రీకాంత్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నిజాంసాగర్ మండలంలోని ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మల్లూర్ సొసైటీ చైర్పర్సన్ కళ్యాణి విఠల్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామ్సింగ్ సర్పంచులు సంధ్యారాణి, కంసవ్వ, ఎంపీటీసీ సభ్యురాలు సాయవ్వ, నాయకులు కిష్టారెడ్డి, గోడల రేఖ, బ్రహ్మానంద్రెడ్డి, గోరేమియా, సీఈవో సాయిలు తదితరులు పాల్గొన్నారు.
పిట్లం మండలంలోని కుర్తి, చిల్లర్గి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం చైర్మన్ శపథంరెడ్డి ప్రారంభించారు. చిల్లర్గి సహకార సంఘ పరిధిలోని రైతులు కొనుగోలుకేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ హన్మాండ్లు, కార్యదర్శి సంతోష్రెడ్డి, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.