హరితహారం పకడ్బందీగా చేపట్టాలి

నిర్మల్ అర్బన్ : హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరితహారం అమలుపై జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అధికారులు సమన్వయంతో ఆరో విడుత హరితహారంలో జిల్లా లక్ష్యం పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతిరోజూ శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, ఆగస్టు 10 నాటికి అన్నిశాఖల లక్ష్యం పూర్తికావాలని ఆదేశించారు. సమావేశంలో అటవీ శాఖ అధికారి సుధాన్, ఏఎస్పీ రాంరెడ్డి, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్కుమార్, ఏడీ మార్కెటింగ్ శ్రీనివాస్, ఎస్సీ అభివృద్ధి అధికారి కిషన్, ఆర్డీవోలు ప్రసునాంబ, రాజు, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మంత్ర ఆఫ్ యూత్.. బై యూత్.. ఫర్ యూత్
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ