తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రవితేజ కూడా ఒకరు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు మాస్ రాజా. ఇప్పుడు కూడా ఖిలాడి సినిమాతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు రవితేజ. కొత్త దర్శకుడు అయినా కూడా ఆయన చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశాడు. అయితే ఈ సినిమా ఒప్పుకోవడం వెనక మరో కథ కూడా ఉంది. దీని కంటే ముందు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయాలి రవితేజ. దానికి కథ కూడా సిద్ధమైంది. అయితే ఈ సినిమాను ఉన్నఫలంగా వెనక్కి నెట్టి శరత్ మండవ సినిమాను ముందుకు తీసుకొచ్చాడు.
ఈ సినిమాలో నటించడానికి రవితేజ విధంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మాస్ రాజా మార్కెట్ మళ్లీ పెరిగింది. దాంతో ఈయన రెమ్యూనరేషన్ కు కూడా రెక్కలు వచ్చాయి. మరోవైపు శరత్ సినిమాలో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమా కోసం కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడు రవితేజ. ఈ నెల రోజుల్లోనే సినిమాలు పూర్తి చేయాలి. 30 రోజులకు 8 కోట్ల పారితోషికంతో పాటు నైజాం హక్కులలో 50 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడు. ఈ లెక్కన ఆయన పారితోషికం రోజుకు 30 లక్షల పైగానే ఉంది. 30 రోజుల్లో 10 కోట్ల రెమ్యూనరేషన్ అంటే చిన్న విషయం కాదు. కానీ రవితేజకు మార్కెట్ వుంది కాబట్టి నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు.
ఒక్క సినిమా హిట్ కావడంతో పోయిన మార్కెట్ మళ్లీ వెనక్కి తెచ్చుకున్నాడు మాస్ రాజా. ఇదే ఊపులో మరో రెండు, మూడు విజయాలు గానీ వచ్చాయంటే రెమ్యూనరేషన్ రేంజ్ 20 కోట్లకు చేరుతుంది. శరత్ సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. వీటికి కూడా భారీ పారితోషికం అందుకుంటున్నాడు రవితేజ. క్రాక్ సినిమాకు ముందు 5 కోట్ల పారితోషికం కూడా తీసుకున్న మాస్ రాజా.. ఒక్క విజయం రాగానే పారితోషకం రెండింతలు చేశాడు. అంతే మరి ఇండస్ట్రీలో హిట్ వచ్చినప్పుడు ఉండే విలువ ఇంకెప్పుడూ ఉండదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న రవితేజకు ఈ విషయం తెలియంది కాదు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు.