వినూత్న ఆవిష్కరణలకు ఆహ్వానం

ఆగస్టు 15వ తేదీన ఆన్లైన్ ద్వారా ప్రదర్శన
ఆదిలాబాద్ కలెక్టర్ శ్రీదేవసేన
ఎదులాపురం : ‘ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆన్లైన్ ద్వారా వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (teamtsic. telangana. gov.in) అవకాశం కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలు జూలై 20వ తేదీలోగా 9100678543 వాట్సాప్ నంబర్కు పంపించాలని సూచించారు. వాటిని రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ పరిశీలించి, జిల్లా నుంచి ఐదింటిని ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయా జిల్లాలో ఆన్లైన్లో ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. రెండు నిమిషాల వ్యవధిలో రూపొందించిన వీడియో, ఆవిష్కరణకు సంబంధించి నాలుగు ఫొటోలు, ఐదు పంక్తుల్లో ఆవిష్కరణల వివరాలు, ఆవిష్కర పేరు, వయసు, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, మొబైల్ నంబర్, జిల్లా, మండలం, గ్రామంతో పాటు ఇతర వివరాలు తప్పనిసరి పంపించాలని సూచించారు.
తాజావార్తలు
- కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ.. 14 మంది అరెస్ట్
- ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఎవరు వాళ్లు?
- వ్యాక్సిన్ తీసుకున్న ఆశావర్కర్ మృతి
- పటాన్చెరులో ఏటీఎం చోరీకి విఫలయత్నం
- నేను ఐశ్వర్యరాయ్ కుర్రాడినంటూ ఓ వ్యక్తి హల్ చల్
- అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి
- దేశంలో కొత్తగా 14 వేల కరోనా కేసులు
- దేశంలో కోల్డ్వేవ్ పరిస్థితులు
- మాల్దీవులలో మాస్త్ ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మీ ఫ్యామిలీ
- ఘనంగా నటుడు శోభన్ బాబు జయంతి