సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ‘సుడా’ ఆధ్వర్యంలో రూ.9.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ను ఆర్థిక శాఖ హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లింగారెడ్డిపల్లి వార్డులోని ఎస్సీ మహిళా సంఘం భవనం అసంపూర్తి పనులు, ఎస్సీ శ్మశాన వాటిక పనులు త్వరలోనే చేపడుతామని హామీ ఇచ్చారు.
అనంతరం మహిళా మండలి సభ్యులకు కుర్చీలను అందజేశారు. అంతకు ముందు మహా రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో 45వ వార్షికోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం
గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న సీఎం కేసీఆర్