తారల అభిమానగణం, ప్రేక్షకుల్లో వారికున్న ఇమేజ్ పారితోషికం లెక్కల్ని ప్రభావితం చేస్తాయి. జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న తారలు భారీ పారితోషికాల్ని డిమాండ్ చేస్తుంటారు. తాజాగా మంగళూరు భామ పూజాహెగ్డే ఒక్కో సినిమాకు మూడుకోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సుందరి తారాపథంలో దూసుకుపోతోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో సత్తాచాటుతోంది. అందుకు తగినట్లుగానే భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే తమిళంలో అగ్ర హీరో విజయ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకుడు. ఈ సినిమా కోసం పూజాహెగ్డే మూడుకోట్ల పారితోషికం స్వీకరించిందని చెన్నై ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా ఎంపికైనట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ఆమెకు మూడు కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. సమకాలీన దక్షిణాది కథానాయికల్లో ఇదే అత్యధిక పారితోషికమని అంటున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాల్లో నటిస్తోంది. హిందీలో సల్మాన్ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాళీ’, రణ్వీర్సింగ్తో కలిసి ‘సిర్కస్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.