కేంద్రాల ఏర్పాటుకు సరైన ప్రణాళికలు రూపొందించాలి
అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు
హన్మకొండ, ఏప్రిల్ 6 : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. ఈ మేరకు సరైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలుపై సివిల్ సప్లయ్, వ్యవసాయ, డీసీవో, వైద్యారోగ్య శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ యాసంగి సీజన్లో వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో సుమారు 2.13లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల రెండో వారం నుంచి జిల్లాలో 105 కొనుగోలు కేంద్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి సెంటర్కు ఒక ప్రభుత్వ ఉద్యోగిని కేటాయించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం క్లీనర్లు, గన్నీ బ్యాగులు, తేమ పరీక్షించే యంత్రాలు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ నెల 10లోగా ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి, కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత ఏడాది మాదిరిగానే టోకెన్ పద్ధతి పాటించాలన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చే కూలీల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లులో స్టోరేజీ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో కలెక్టర్ జీ సంధ్యారాణి, వ్యవసాయ శాఖ జేడీ ఉషాదయాళ్, డీసీవో నాగేశ్వర్రావు, డీసీఎస్వో వసంతలక్ష్మి, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం కృష్ణవేణి, డీఎంహెచ్వో డాక్టర్ లలితాదేవి, డీపీవో జగదీశ్వర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పోలింగ్ బూత్లో పేలిన నాటు బాంబు
ఈవీఎంతో బంధువుల ఇంటికి.. సెక్టార్ ఆఫీసర్ సస్పెండ్