కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతో ఎస్సారెస్పీకి పునర్జీవం
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ముప్కాల్ వద్ద రివర్స్ పంపింగ్ పనుల పరిశీలన
బాల్కొండ, (ముప్కాల్) ఏప్రిల్ 4: ఎండాకాలంలోనే కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్కు తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న కాళేశ్వరం రివర్స్ పంపింగ్ పనులను మంత్రి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్కాల్ పంప్హౌస్ 0.5 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉందన్నారు. 365 రోజులు తాగు, సాగు నీటికి ఢోకా ఉండదన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, రైతుల పక్షాన మంత్రి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు మంత్రి వేల్పూర్, బాల్కొండ, భీమ్గల్, మోర్తాడ్ మండలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ఎండాకాలంలోనే కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి వేముల ప్రశాంత్ తెలిపారు. ముప్కాల్ మండల కేంద్రంలో కొనసాగుతున్న కాళేశ్వరం రివర్స్ పంపింగ్ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని ప్రారంభించి పూర్తిచేశారన్నారు. మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్తో వరద కాలువల ద్వారా ఎస్సారెస్పీని నింపుతున్నట్లు చెప్పారు. వరద కాలువలు నిండుగా ప్రవహించడంతో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ముప్కాల్ పంప్హౌస్ 0.5 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉందన్నారు.
పంప్హౌస్లో ఎనిమిది మోటర్లకు గాను నాలుగు మోటర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 365 రోజులు తాగు, సాగు నీటికి ఢోకా ఉండదన్నారు. సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ మహా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన కేసీఆర్, ఇంజినీర్ల జన్మధన్యమైందన్నారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, రైతుల పక్షాన మంత్రి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, ఎంపీపీ సామపద్మ వెంకట్రెడ్డి, జడ్పీటీసీ బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్, రాజరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి