పెట్టుబడికి ఢోకా లేదు..!

- రైతుబంధు నిధులు విడుదల
- త్వరలో రైతుల ఖాతాల్లో జమ
- నిర్మల్ జిల్లాలో1.65 లక్షల మందికి లబ్ధి
నిర్మల్, నమస్తే తెలంగాణ : పంట పెట్టుబడుల కోసం అన్నదాతలకు రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఎకరానికి యాసంగిలో రూ.5వేలు, వానాకాలంలో రూ.5 వేల చొప్పున ఎకరానికి అందిస్తూ వారికి ప్రభుత్వం ఆర్థిక ధీమాను కల్పిస్తున్నది. సీజన్ ప్రారంభం లో అందిస్తున్న ఈ సహాయం తో రైతులకు పెట్టుబడికి ఇబ్బం ది లేకుండా పోతున్నది. నిర్మల్ జిల్లాలో గతేడాది 1,38,898 మంది రైతులకు రూ.183.61 కోట్లు అందించారు. తాజాగా జిల్లాలో వానాకాలం సీజన్ కోసం 1.65 లక్షల మంది రైతులకు ఈ ఆర్థిక సాయం అందనుంది. గతంలో జూన్ 10, 2019 నాటికి మ్యుటేషన్ అయిన భూములకు కటాఫ్ తేదీగా నిర్ణయించి ఆర్థిక సహాయం అందించారు. తర్వాత క్రయ విక్రయాలు జరిగి మ్యుటేషన్ అయిన భూములకు ఈసారి ఆర్థిక సహాయం చేస్తుండగా.. ఇందుకు సంబంధించి కటాఫ్ తేదీ ప్రకటించనున్నారు. ఆ లోపు జరిగిన మ్యుటేషన్, క్రయ విక్రయాలకు సంబంధించి సీసీఎల్ఏ ద్వారా వివరాలను వ్యవసాయశాఖ ఎన్ఐసీకి పంపనుంది. కరోనా వైరస్ విజృంభణతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!
- డ్రైవర్ను కొట్టిన ప్రముఖ నటుడు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- విద్యుదాఘాతంతో వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- పూరి, విజయ్ సినిమా.. టైటిల్, ఫస్ట్లుక్ విడుదలకు టైం ఫిక్స్
- విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జాం
- కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ టాప్
- దీప్సింగ్ సహా పలువురికి ఎన్ఐఏ సమన్లు: రైతు నేతల ఫైర్
- శ్రీను వైట్ల టు బాబీ..రవితేజ పరిచయం చేసిన డైరెక్టర్లు వీళ్లే