హైదరాబాద్ : గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్ పరారీలో ఉన్నాడు. తన కంపెనీలో పెట్టుబడి పెడితే 4 శాతం లాభా లు ఇస్తానని నమ్మించి మోసం చేశాడని బాధితుడు ఫిబ్రవరిలో రాంచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పట్లో పోలీసులు ఆనంద్ ప్రసాద్ కుమారుడు, కోడల్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి భవ్య ఆనంద్ ప్రసాద్, అతడి భార్య, మరో వ్యక్తి శివకుమార్ పరారీలో ఉన్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆనంద్ ప్రసాద్ వ్యవహారం సంచలనంగా మారింది. 2017లో జూపల్లి సత్యనారాయణరావు వద్దకు భవ్య సిమెంట్స్ అధినేత, సినీ నిర్మాత ఆనంద్ ప్రసాద్ , ఆదిత్య వెన్నిగల, శివకుమార్లు వచ్చి మాకు బాచుపల్లి, దుండిగల్, బౌరంపేటల్లో స్థలాలు ఉన్నాయి … మాకు డబ్బు చాలా అవసరం ఉంది… తిరిగి ఆ డబ్బు ను ఆరునెలలకు ఒక్కసారి చెల్లించి అప్పును తీరుస్తామని చెప్పారు. లేదంటే ఈ స్థలాలను మార్కెట్ ధరకు మీకు రిజిస్టర్ చేస్తామన్నారు.
అయితే.. బీహెచ్ఈఎల్ వద్దకు పిలిచి సత్యనారాయణకు ఆ స్థలాలను చూపించారు. సత్యనారాయణ నగదును బ్యాంక్ ద్వారా చేస్తానని చెప్పగా కొద్దిగా వెనక్కి తగ్గారు. కొన్ని రోజుల తర్వాత ఆనంద్ప్రసాద్, ఆదిత్య వెన్నిగల, శివకుమార్, కృష్ణకుమారి వెన్నిగల, నిఖిల వెన్నిగల సత్యనారాయణ వద్దకు వచ్చి మేము రియల్ ఎస్టేట్, సిమెంట్ వ్యాపారం చేస్తున్నాం.. ఆ లాభాల్లో 4 శాతం ఇస్తామని నమ్మించారు. అప్పుడు సత్యనారాయణ భవ్య సిమెంట్స్ సంస్థ పేరు మీద ఉన్న ఖాతాకు కోటి రూపాయలను చెక్ ద్వారా బదిలీ చేశాడు. ఈ చెక్ను ఆనంద్ ప్రసాద్, శివకుమార్, ఆదిత్య వెన్నిగలకు ఇచ్చారు. ఆరు నెలల తర్వాత జూపల్లి సత్యనారాయణ ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని అడిగాడు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున కొద్ది రోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత మరోసారి అడిగితే ఇంకా కొన్ని రోజులు ఆగాలని చెప్పా రు.
మరోసారి వెళ్లి అడిగినా వారు డబ్బు ఇవ్వలేదు. అయితే బౌరంపేట, బాచుపల్లి, దుండిగల్లో ఉన్న స్థలాలను రిజిస్టర్ చేయాలని సత్యనారాయణ కోరగా.. మరోసారి డబ్బులు అడిగితే చంపేస్తామ ని ఆనంద్ ప్రసాద్, శివకుమార్, ఆదిత్యవెన్నిగల బెదిరించారు. దీంతో సత్యనారాయణ వారిపై రాంచంద్రాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టి అప్పట్లో ఆనంద్ ప్రసాద్ కుమార్ కు మారుడు, కోడల్ని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు భవ్య ఆనంద్ ప్రసాద్, అతడి భార్య కృష్ణకుమారి, శివకుమార్లు ఇంకా పరారీలో ఉన్నారు. ఆనంద్ ప్రసాద్ ఈ విధంగా దాదాపు 100 మంది నుంచి రూ.100 కోట్లు తీసుకున్నాడని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటికి రావడంతో భవ్య ఆనంద్ ప్రసాద్ వ్యవహారం సంచలనంగా మారింది.