బడ్జెట్పై వెల్లువెత్తిన హర్షం
సీఎం చిత్రపటాలకు ఊరూరా క్షీరాభిషేకం
ప్రజాప్రతినిధులు సహా సకల జనుల సంబురం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని సకల జనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నివర్గాల వారికి మేలు జరిగేలా కేటాయింపులు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ను వేనోళ్లా కొనియాడుతున్నారు. ముఖ్యంగా మండల, జిల్లా పరిషత్లు, ఆర్టీసీ, వ్యవసాయం, చేనేత రంగాలకు ప్రత్యేకంగా పద్దుల కేటాయింపులను అభినందిస్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారం సాయంత్రం వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు.
నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న ప్రజాప్రతినిధులు