అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం రాత్రి జరిగిన నాలుగో టీ-20 మ్యాచ్లో ఇంగ్లండ్పై విరాట్ కోహ్లీ సారధ్యంలోని టీమిండియా విజయం సాధించింది. ఎనిమిది పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. దీంతో ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఐదు టీ-20 మ్యాచ్ల సిరీస్ 2-2గా సమం అయ్యింది. దీంతో ఈ నెల 20వ తేదీన జరుగనున్న ఐదవ, చివరి టీ-20 మ్యాచ్ కీలకం కానున్నది. టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కూడా ఎనిమిది వికెట్లే కోల్పోయినా 177 పరుగులకే పరిమితమైంది.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ మరోసారి కుప్పకూలింది. చావోరేవో అన్న రీతిలో తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సారధి విరాట్ కోహ్లీ.. అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయారు. స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీతో షైనింగ్ అయ్యారు. టాప్ ఆర్డర్ కుప్పకూలినా.. నిలకడగా ఆడుతూ జట్టును గట్టెక్కించాడు. సూర్యకుమార్ వివాదాస్పద డిస్మిసల్ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ జట్టు 185 పరుగులు జత చేశారు.