పస్తుతం పార్లమెంట్ నిర్వహణలో అత్యంత కీలకపాత్రను పోషిస్తున్న స్థాయీ సంఘాల వ్యవస్థకు కూడా పీవీ నరసింహరావునే ఆద్యుడు. ఆ విషయం ఆలస్యంగా వెల్లడయింది. స్థాయీ సంఘాలను 1993 మార్చి 31న లాంఛనంగా ప్రారంభించగా, ఆ విషయాన్ని 10వ లోక్సభ ముగింపు సమావేశాల సందర్భంగా అప్పటి స్పీకర్ శివరాజ్పాటిల్ వెల్లడించారు. పీవీ సూచన మేరకే దీనిని ప్రవేశపెట్టామని ప్రకటించడం విశేషం.