బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు
120కిపైగా అర్జీలు
ఉట్నూర్, జులై 15: ఏజెన్సీలో బాలల హక్కుల ను రక్షించేందుకే బాల అదాలత్ నిర్వహించామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు అన్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో గురువారం బా ల అదాలత్ నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ సమస్యలపై 120కి పైగా అర్జీలు వచ్చాయి. వీటిని పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరించేందు కు సంబంధిత శాఖలకు అప్పగించారు. అనంత రం విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో బాలల హక్కులను రక్షించేందుకు, వారికి విద్య, వైద్య, పౌష్టికాహారం అందేలా తమ చర్యలు ఉంటాయన్నారు. తమ పర్యటనలో చాలా తెలుసుకున్నామ ని, వాటిని ప్రభుత్వానికి తెలిపి పూర్తిస్థాయిలో బా లలకు న్యాయం జరిగేలా ప్రోత్సహిస్తామన్నారు. ఈ బాల అదాలత్ నిరంతర ప్రక్రియగా నిర్వహిం చనున్నట్లు పేర్కొన్నారు. తమ కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా సమాచారం అందించినా, పరిష్కరిస్తామన్నారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్ మాట్లాడుతూ కమిషన్తో తమ జిల్లా యంత్రాంగం పూ ర్తి సమన్వయం చేసుకుంటూ బాలల హక్కుల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. క మిషన్ సభ్యులు శోభారాణి, అపర్ణ, దేవయ్య, అంజన్రావు, ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా, వివిధ శాఖల అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభా గం అధికారి రాజేంద్రప్రసాద్, సీడీపీవో శ్రావణి, జిల్లా కమిటీ చైర్మన్ వెంకటస్వామి, సభ్యులు సమీ ర్ ఉల్లాఖాన్, దశరథం, డేవిడ్ పాల్గొన్నారు.