నిర్మల్ అర్బన్, జూలై 12 : వార్డుల్లో ఎలాంటి పారిశుధ్య సమస్యలు లేకుండా చూసుకుంటూ పట్టణాన్ని స్వచ్ఛ నిర్మల్గా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవా రం పట్టణంలోని బర్కత్పుర, ప్రియదర్శినినగర్ కాలనీలో ఆయన పర్యటించారు. కాలనీ వాసుల తో కలిసి వార్డులోని అన్ని ప్రాంతాలను పరిశీలిం చారు. స్థానికులు పలు సమస్యలను విన్నవించా రు. వీటిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహ కారంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో కౌన్సిలర్ ఎర్రవోతు నవనీత సురేందర్, చాహుస్, మున్సిపల్ ఏఈ వినయ్ కుమార్, జవాన్ సంతోష్ తదితరులున్నారు.
పనులు వేగవంతం చేయండి..
నిర్మల్లోని శివాజీ చౌక్ నుంచి గాజుల్పేట్ వరకు చేపట్టిన రోడ్డు సుందరీకరణ పనులు వేగ వంతంగా పూర్తి చేయాలని అధికారులను మున్సి పల్ చైర్మన్ ఈశ్వర్ ఆదేశించారు. పట్టణంలో అట వీ శాఖ కార్యాలయం ఎదుట నుంచి బస్డిపో వరకు చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా మెయిన్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త, పూడిక తీతను జేసీబీ సాయంతో తీయించారు. డ్రైనేజీపై ఫుట్పాత్ను ఏర్పాటు చేస్తున్నందున నీరు నిల్వ కుండా ఉంటుందన్నారు. కౌన్సిలర్ అయ్యన్నగా రి రాజేందర్, రాజేశ్వర్ తదితరులున్నారు.