నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి
పట్టణంలోని మహాలక్ష్మీ కాలనీలో కార్డన్సెర్చ్
సరైన పత్రాలు లేని 65 వాహనాలు సీజ్
నిర్మల్ అర్బన్, జూలై 11 : జిల్లా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు కల్పించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ కాలనీ మహాలక్ష్మీవాడలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇలాంటి కార్డన్సెర్చ్లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారా? అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కాలనీలను నేరరహితంగా తీర్చిదిద్దేందుకే ఇలాం టి కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టంచేశారు. నేరాల ను నిరోధించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రతికాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీల్లో వాహనాలను తనిఖీ చేసినప్పుడు నంబర్ ప్లేట్ సరిగ్గా లేవని, అలాంటి వాహనాలు కలిగిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వాహనాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్ చేసుకోవాలని తెలిపారు. ఎ లాంటి పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి డాక్యుమెంట్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని, డాక్యుమెంట్లు లేని వాహనాలను కొ నుగోలు చేయవద్దని తెలిపారు. తనిఖీల్లో ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. రూ.30 వేల విలువైన 51.35 లీ టర్ల లిక్కర్, రూ.500 విలువైన గుట్కాలు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 62 బైక్లు, మూడు ఆటోలను సీజ్ చేశామని తెలిపారు. తనిఖీల్లో డీఎస్పీతో పాటు ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 13 మంది ఏఎస్ఐలు, 60 మంది కానిస్టేబుళ్లు, స్ఫెషల్ పార్టీ పోలీసులు పాలుపంచుకున్నారు. సీఐలు శ్రీనివాస్, జీవన్రెడ్డి, ఎస్ఐ రమేశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
పెళ్లి క్యాన్సిల్..బీచ్లో మెహరీన్ ఎంజాయ్
అజిత్ ‘వలిమై’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..వీడియో
రూపాయికే ఆరెస్సెస్ సంస్థకు విలువైన భూమి.. దిగ్విజయ్ సింగ్ నిరసన
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి : వినయ్ భాస్కర్