దస్తురాబాద్ : గ్రామాల్లో వందశాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని జడ్పీ సీఈవో సుధీర్బాబు సూచించారు. కొవిడ్ను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ను నిర్వహిస్తుందని ఆయన వివరించారు. మండలంలోని బుట్టాపూర్, మున్యాల, రాంపూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ క్యాంపులను ఆదివారం ఎంపీడీవో క్రాంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఏ గ్రామాల్లో టీకాల లక్ష్యాలను, ఎంతమందికి టీకాలు ఇస్తున్నారని అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ టీకాపై భయందోళనకు గురికాకుండా తప్పనిసరిగా కొవిడ్ టీకాలను వేసుకోవాలని గ్రామస్తులను కోరారు .
ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో అనిల్ కుమార్, సర్పంచ్ దుర్గం శంకర్, ఆర్ఐ గంగన్న, ఏపీయం గంగాధర్, హెచ్ఈవో వేణు గోపాల్, వీఆర్వో విశ్వనాథ్, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు సంతపూరి శ్రీనివాస్, దుర్గం రాజలింగం, బాదం లక్ష్మీరాజం , వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కర్యకర్తలు పాల్గొన్నారు.