ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
పలు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ఖానాపూర్ టౌన్, జూన్ 30: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేయనున్న ‘దళిత సాధికారత పథకం’ దేశానికే ఆదర్శం కా నుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్పష్టం చేశారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో దళిత సంఘాల నాయకులతో కలసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీ సుకరావడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.రైతు బంధు, రైతు బీమా లాగే దళిత సాధికారత పథకం ఇతర రాష్ర్టాలకు ఆదర్శం కానుందని తెలిపారు. ఈ సందర్భంగా ఖా నాపూర్ మండల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రేఖానాయక్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పట్టణంలోని నాయీబ్రాహ్మణ సంఘ భవనానికి రూ. 2 లక్షల ప్రొసీడింగ్ కాపీని ఆ సంఘ నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పత్రి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వై స్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, కౌన్సిలర్ కావలి సంతోష్, మండల, పట్టణాధ్యక్షుడు రాజగంగన్న, సురేశ్, కౌట మహేశ్, పెద్ది మల్లే శ్, జన్నారపు శంకర్, మునుగురి నరేందర్, గొర్రె గంగాధర్, పత్రి నగేశ్, పూసల మనోజ్, సుధాకర్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారత పథకాన్ని అమలు చేయడం హర్షణీయమని పీఏసీఎస్ చైర్మన్ మారుతీ పటేల్ డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ మోహన్నాయ క్ అన్నారు.
మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కా ర్యాలయం ఆవరణలో మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు రానున్నాయని పేర్కొన్నారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జ ద్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు శివా జీ సర్కాళే, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియాన్, టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సుకేష్న, దళిత సంఘాల నాయకులు శివాజీ, భరత్, మహిళలు ప్రయాగ్బాయి, టీఆర్ఎస్ మండల శాఖ నాయకులు దేవ్పూ జే మారుతి, కోరెంగా సుంకట్రావ్, కనక హనుమంత్రావ్, నగేశ్, బాబుముండే, తదితరులు పాల్గొన్నారు.
కడెం, జూన్ 30: ప్రభుత్వం తీసుకొస్తున్న పథకంతో దళిత కు టుంబాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీపీ అలెగ్జాండర్ అ న్నారు. మండలకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్హైమద్, సర్పంచ్లు ఆకుల బాలవ్వ, బద్దెనపల్లి విజయసెఫెన్, జడ రాజమణి, ఒర్సు వెంకటేశ్, మెలుగూరి రాముగౌ డ్, శ్రీకాంత్యాదవ్, మేకల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ల సం ఘం మండలాధ్యక్షుడు ముడికె మల్లేశ్ యాదవ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కానూరి సతీశ్, ఆకుల లచ్చన్న, ఇందూర్నేత, బోర్లకుంట రాజేశ్, నర్సింగ్ రమేశ్, తదితరులున్నారు.
కుంటాల, జూన్ 30 : దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టడం అభినందనీయమని అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మగ్గిడి దిగంబర్ అన్నారు. కుంటాల మండల కేంద్రంలో సీ ఎం కేసీఆర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చిత్రపటాలకు బుధవారం దళిత సంఘాల నాయకులు పాలాభిషేకం చేశారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, అంబేద్కర్ సంఘం మండలాధ్యక్షుడు కరుణాకర్, ఎంపీటీసీ దాసరి మధు, నాయకులు బాలయ్య, భూ మేశ్, సాయి, తదితరులున్నారు.
లక్ష్మణచాంద, జూన్ 30:దళిత వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి అన్నారు. మండలంకేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి దళిత సంఘ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం క్షీరాభిషేకం చేశారు. నాయకులు కేశం రమేశ్, అడ్వాల రమేశ్, ఈటెల శ్రీనివాస్, గుజ్జారి గణేశ్, పడిగెల గంగాధర్, జహీరొద్దీన్, సాతం గంగారాం తదితరులు పాల్గొన్నారు.