ముథోల్ : గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు లిక్కర్ షాపులలో రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ముథోల్ నియోజక వర్గ గౌడ కులసంఘం సభ్యులు ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీగౌడ్, ఎంపీపీ ఆప్రోజ్ఖాన్, ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు అశోక్గౌడ్, దేవేందర్గౌడ్, మురళీగౌడ్, తిరుపతి గౌడ్, సాయిబాబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.