న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు తెలంగాణకు చెందిన జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఎంపికయ్యారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) టోక్యో విశ్వక్రీడల కోసం కోచ్లు, సహాయక బృందాన్ని శనివారం ఎంపిక చేయనుంది. చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ నేతృత్వం వహించనున్న 13 మంది భారత కోచ్ల బృందంలో రమేశ్ చోటు దక్కించుకున్నారు. టోక్యోకు అర్హత సాధించిన అథ్లెట్ల అవసరాలకు తగ్గట్లు కోచ్లను ఎంపిక చేసినట్లు ఏఎఫ్ఐ అధ్యక్షుడు అదిల్లె సుమరివాలా పేర్కొన్నారు.