రామగిరి, ఏప్రిల్ 18: నిత్య సృజనశీలి కవి, రచయిత వాగ్గేయకారుడు అంబటి వెంకన్న అని ప్రముఖ సాహి తీవేత్త డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. నల్ల గొం డకు చెందిన అంబటి వెంకన్న రచించిన ‘అలుగెల్లిన పాట’, నాన్నే నా చిరునామా’ పుస్తకాలను ఆదివారం నల్లగొండలోని టీఎస్యూటీఎఫ్ భనవంలో సృజన సాహితీ సంస్ధ ఆద్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో దళిత కవిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన అంబటి వెంకన్న ఇయ్యాల బహుముఖ ప్రజ్ఞశాలిగా ఎదిగి తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాందించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలుగెల్లిన పాట వ్యాస సం పుటి ఒక గొప్ప పరిశోధన గ్రంథమని, వెంకన్నకు డాక్ట రేట్ ఇవ్వదగిన పుస్తకమని అంతటి కృషి ఇందులో ఉం దన్నారు. సుద్దాల హనుమంతు మొదలుకొని 42 మం ది తెలంగాణ పాట కవుల జీవితాన్ని వడపోసిన గొప్ప గ్రంథం అన్నారు.
మత్తడి ధూమ్ దాం చేసిన పాట అనే పేరుతో రాసిన ముందుమాట అద్భుతంగా ఉన్నదని పే ర్కోన్నారు. అదే విధంగా ప్రముఖ సంఘ సేవకులు ఏకోనారాయణ నాన్నే నా చిరునామ పుస్తకాన్ని ఆవిష్క రించారు. అయితే రచయిత అంబటి స్వగ్రామమైన నల్లగొండ మండల దోమలపల్లి గ్రామానికి అంకితం ఇ చ్చిన ఈ పుస్తకాలన్ని ఆ గ్రామ సర్పంచ్ ఉపేంద్రాచారికి అందజేశారు. అదే మునాస్ వెంకట్, ఎలికట్టే శంకరావు లు మాట్లాడారు. డా. పగడాల నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కవులు, రచయితలు బైరెడ్డి కృష్ణారెడ్డి, పెరుమాళ్ల ఆనంద్, బండమీది అంజయ్య, అంబటి ఎల్లయ్య, ఉదర వెంకటేశం, డా. లింగనబో యిన లేఖనందస్వామి, అంబటి వెంకటయ్య, కత్తుల శంకర్, డప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కోహ్లీసేన ఆల్రౌండ్షో.. బెంగళూరుకు హ్యాట్రిక్ గెలుపు
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు