వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 21: ప్రజలు అపోహలను నమ్మకుండా నిశ్చింతగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలోని టీకా కేంద్రాన్ని బుధవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, నిర్ణీత దూరం పాటించాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట కర్ఫ్యూ విధించామని.. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.