న్యూఢిల్లీ: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్) లేదా ఇండియన్ స్టాటిస్టిక్స్ సర్వీస్ (ఐఎస్ఎస్) పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఐఈఎస్ లేదా ఐఎస్ఎస్లో దేనికి అప్లయ్ చేస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
అర్హత: స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్లో డిగ్రీగానీ, పీజీ చేసి ఉండాలి. 21 నుంచి 30 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. రాతపరీక్ష వెయ్యి మార్కులకు, ఇంటర్వ్యూ 200 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 27
వెబ్సైట్: upsc.gov.in లేదా upsconlinenic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..