హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ఈ నెల 14న జరగనుంది. ఈ ప్రవేశపరీక్ష కోసం హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆగస్టు 14న (శనివారం) ఉదయం 10 నుంచి 12:30 గంటల మధ్య పరీక్ష జరగనుంది. పరీక్షకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 9 నుంచి అధికారిక వెబ్సైట్ http://tsrjdc.cgg.gov.in నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయిన అధికారులు తెలిపారు.