హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఆర్జేసీ సెట్ పరీక్ష తేదీని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రకటించారు. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఈ పరీక్షను ఆగస్టు 14న నిర్వహించునున్నామని వెల్లడించారు. వచ్చే నెల 9న నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని, పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నవారు అధికారిక వెబ్సైట్ http://tsrjdc.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.