ఖమ్మం సిటీ, ఏప్రిల్ 4: ఒంటికి దుస్తులు, కాళ్లకు చెప్పులు ఎలాగో, ముఖానికి మాస్క్లు కూడా జీవనంలో భాగమయ్యాయి. ఇటీవల మార్కెట్లోకి ఎన్నోరకాల మాస్క్లు వచ్చాయి. ఎన్-95, సర్జికల్, క్లాత్ ఇలా అనేక రకాల మాస్క్లను చూశాం. మాస్క్ తయారీకి మెటీరియల్తో పనిలేకుండా, ముఖానికి కరోనాను ఎదుర్కోగలదా అనే అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఖరీదైనవి అయినప్పటికీ వదులుగా ఉండే వాటితో ఎలాంటి ఉపయోగం లేదని, ఫిట్గా ఉండే క్లాత్తో తయారు చేసింది ఏదైనా మేలు చేస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించిన సంగతి విదితమే.
మళ్లీ పెరుగుతున్న కేసుల సంఖ్య..
గత సంవత్సరం కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ సైతం విధించింది. మెల్లగా కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత లాక్డౌన్ సడలింపులు మొదలయ్యాయి. జనం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని అనుకునేలోపే ఇటీవల కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. రెండోసారీ క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను అప్రమత్తం చేస్తున్నది. ప్రధానంగా మాస్క్ వినియోగంపై విస్తృత ప్రచారం చేస్తున్నది. మాస్క్లు ధరించకపోతే జరిమానా సైతం విధిస్తామని ఇప్పటికే ప్రకటించింది.
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ..
నిర్లక్ష్యంగా సామాజిక ఉల్లంఘనలకు పాల్పడుతున్నరు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలుచేసి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని భావించింది. దీనిలో భాగంగా పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. ముఖానికి మాస్క్ ధరించని వారెవరైనా, బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే రూ.వెయ్యి జరిమానా విధించాలని ఆదేశించింది. ప్రకృతి విపత్తుల నివారణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉభయ జిల్లాల పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. ఓ వైపు ప్రభుత్వం కరోనాపై అవగాహన కల్పిస్తూనే, నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. పోలీసులు ఖమ్మం నగరంతో పాటు, అన్ని పట్టణాలు, మండల కేంద్రాల పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చూడండి..
ఆ అమర జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు: రాష్ట్రపతి
ఛత్తీస్గఢ్లో 24కు చేరిన నక్సల్స్ దాడి మృతులు..!