హైదరాబాద్: రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగించారు. మూడు, ఐదేండ్ల న్యాయ, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏటా లాసెట్, పీజీ లాసెట్ను నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం మే 26తో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో అప్లికేషన్స్ లాస్ట్ డేట్ను జూన్ 3 వరకు పొడిగించారు.
ఈ ప్రవేశపరీక్ష ద్వారా మూడేండ్ల ఎల్ఎల్బీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సులైన బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీకామ్ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీలో, రెండేండ్ల పీజీ లా కోర్సులైన ఎల్ఎల్ఎంలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో మొత్తం 21 లా కాలేజీలు ఉన్నాయి.
అర్హతలు: ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సులకు.. 45 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మూడేండ్ల లా కోర్సులకు.. 45 శాతం మార్కులతో డీగ్రీ ఉత్తీర్ణులవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: లాసెట్.. రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.500
పీజీలాసెట్.. రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.800
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 3
రాతపరీక్ష: ఆగస్టు 23
వెబ్సైట్: https://lawcet.tsche.ac.in