న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 21 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించనున్నారు.
మొత్తం పోస్టులు: 30
ఇందులో జనరల్ 12, ఓబీసీ 8, ఎస్సీ 4, ఎస్టీ 3, ఈడబ్ల్యూఎస్ 3 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా టెలీకమ్యూనికేషన్లో నాలుగేండ్ల బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. 2021, ఏప్రిల్ 1 నాటికి 25 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 12
దరఖాస్తులకు చివరితేదీ: మే 21
వెబ్సైట్: https://register.cbtexams.in/BEL/SBU/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి